ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా వేరే దేశం చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. ఇది నిజం. ఈ మధ్యే ఈడీ అధికారులు ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ (పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులు)ను ప్రయోగించారు. ఆ తర్వాతే మాల్యాలో చలనం వచ్చిందన్నది వాస్తవం. తాను చాలా నిజాయతీపరుడునని సుదీర్ఘ ప్రకటన చేసిన మాల్యాకి ఇన్నాళ్లు స్వదేశం గుర్తుకే రాలేదు. భారత దేశాన్ని ఆయన మర్చిపోయి పరాయి దేశంలో విలాసాల్లో ఉన్నారు. ఇప్పుడిక రానంటే కుదరదు… ఆగస్ట్ 27లోగా న్యాయస్థానంలో మాల్యా హాజరుకావాలి. ఒకవేళ రాకపోతే అతడిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటిస్తామని, మాల్యాకు చెందిన 12,500 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని న్యాయస్థానం స్పష్టంగా వివరించింది. ఈ మధ్యే వచ్చిన ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్ ప్రకారం ఆర్థిక నేరాలు చేసి పారిపోయిన వ్యక్తుల ఆస్తులను జప్తుచేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.
Related Posts
వాట్సాప్ పేమెంట్ సర్వీస్… సురక్షితమేనా ?
ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం
July 1, 2018
స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్
July 1, 2018
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018
రూ.499కే 4G రూటర్… జియో బంపర్ ఆఫర్
టెలికాం రంగంలో మరో సంచలనం. జియో నుంచి మరో బంపర్ ఆఫర్. కేవలం 499
July 3, 2018