May 30, 2023

శ్రీ రామాయణ్‌ ఎక్స్‌ప్రెస్‌… త్వరలో

శ్రీ రామాయణ్‌ ఎక్స్‌ప్రెస్‌… త్వరలో

అలనాడు రామాయణంలో సీతారాములు నడిచిన ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా. అయితే వచ్చేస్తోంది శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌. వచ్చే నవంబర్‌ లో శ్రీ రామాయణ్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో స్పెషల్‌ టూరిస్ట్‌ ట్రైన్‌కి భారత రైల్వే పచ్చజెండా ఊపింది. . ఈ రైలు అయోధ్య నుంచి రామేశ్వరం మధ్య రామాయణంలో ముఖ్య ప్రదేశాలను కలుపుతూ వెళ్తుంది. రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌ ఈ మేరకు మంగళ వారం ట్వీట్‌ చేశారు. నవంబర్‌ 14న దిల్లీలో ఈ ప్రత్యేక రైలు ప్రారంభోత్సవం జరుగుతుంది. శ్రీ రామాయణ్‌ ఎక్స్‌ప్రెస్‌ మొత్తం ప్రయాణం 16 రోజులు. దిల్లీ నుంచి అయోధ్య, నందిగ్రామ్‌, సీతా మర్హి, జనక్‌పూర్‌, వారణాసి, ప్రయాగ్‌, శృంగవర్‌పూర్‌, చిత్రకూట్‌, నాసిక్‌, రామేశ్వరం వరకు 16 రోజుల యాత్ర సాగుతుంది. ఈ యాత్రా స్పెషల్‌లో 800 బెర్తులుంటాయి. ఐఆర్‌ సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఒక్కో యాత్రికునికి ప్రయాణం, భోజనం, వసతి, సైట్‌ సీయింగ్‌ అన్ని కలిపి రూ.15,120 ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ టూర్‌ ప్యాకేజీలో శ్రీ లంక యాత్ర కూడా ఉంది . వెళ్లాలి అనుకునే వారు రామేశ్వరం యాత్ర తర్వాత చెన్నై నుంచి కొలంబో చేరేలా విమాన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. శ్రీ లంక టూరిజం శాఖ అక్కడ రామాయణ ప్రాంతాలను చూపిస్తారు. రామేశ్వరం శ్రీలంక యాత్రా ప్యాకేజీ ఛార్జీలు అదనం.. త్వరలోనే బుకింగ్‌ కూడా ఓపెన్‌ చేస్తామని రైల్వే శాఖ చెప్తోంది. శ్రీ సీతారాముల పాదస్పర్శతో పునీతమైన క్షేత్రాలను చూడాలనుకునేవారికి ఇది మంచిఅవకాశం

 

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *