మొత్తానికి జనసేన జోరందుకుంది. ఆవిర్భావ దినోత్సవం నాడే తొలి జాబితా విడుదల చేసి పవర్ చూపించింది. అనుకున్న ప్రకారం క్లీన్ ఇమేజ్ ఉన్నవారితోనే జాబితా విడుదల చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 32 మంది శాసన సభ అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. నలుగురు పార్లమెంటు అభ్యర్థుల పేర్లు కూడ ఖరారు చేశారు. ఆవిర్భావ దినోత్సవం నాడు లిస్ట్ విడుదల చేయడం జన సైనికుల్లో జోష్ నింపింది. రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ ఎంపీ అభ్యర్థులను పవన్ ముందే ప్రకటించారు. విశాఖ సీటు కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న గేదెల శ్రీనుబాబు ఆశ నెరవేరింది. ఇక అనకాపల్లి నుంచి చింతల పార్ధ సారథి ఎంపీ అభ్యర్ధిగా పవన్ ప్రకటించారు. జనసేనను తన అనుభవంతో నడిపిస్తున్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి, తోట చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్ శాసన సభ స్థానం నుంచి పోటీ చేస్తారు. జనసేన నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు పవన్. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో 8 మంది కొత్త వారు ఈ సారి బరిలో దిగేందుకు అవకాశం లభించింది.. ఇది నిజంగా ట్రెండ్ సెట్టింగే.
ఇక జనసేన విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ ఇదే:
1. యలమంచిలి– సుందరపు విజయ్కుమార్
2. పాయకరావుపేట– నక్కా రాజబాబు
3. పాడేరు – పసుపులేటి బాలరాజు
4. రాజాం– డాక్టర్ ముచ్చా శ్రీనివాసరావు
5. శ్రీకాకుళం– కోరాడ సర్వేశ్వర రావు
6. పలాస– కోత పూర్ణ చంద్రరావు
7. ఎచ్చెర్ల– బాడన వెంకట జనార్ధన్ (జనా)
8. నెల్లిమర్ల– లోకం నాగమాధవి
9. తుని– రాజా అశోక్బాబు
10. రాజమండ్రి సిటీ– కందుల దుర్గేష్
11. రాజోలు– రాపాక వర ప్రసాద్
12. పి.గన్నవరం– పాముల రాజేశ్వరి
13. కాకినాడ సిటీ– ముత్తా శశిధర్
14. అనపర్తి– రేలంగి నాగేశ్వరరావు
15. ముమ్మిడివరం– పితాని బాలకృష్ణ
16. మండపేట– వేగుళ్ల లీలాకృష్ణ
17. తాడేపల్లిగూడెం– బొలిశెట్టి శ్రీనివాస్
18. ఉంగుటూరు– నవుడు వెంకటరమణ
19. ఏలూరు– రెడ్డి అప్పలనాయుడు
20. తెనాలి– నాదెండ్ల మనోహర్
21. గుంటూరు వెస్ట్ – తోట చంద్ర శేఖర్
22. పత్తిపాడు– రావెల కిషోర్బాబు
23. వేమూరు– డాక్టర్ ఎ.భరత్ భూషణ్
24. నరసరావుపేట– సయ్యద్ జిలానీ
25. కావలి– పసుపులేటి సుధాకర్
26. నెల్లూరు రూరల్– చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
27. ఆదోని– మల్లిఖార్జునరావు (మల్లప్ప)
28. ధర్మవరం– మధుసూదన్ రెడ్డి
29. రాజంపేట– పత్తిపాటి కుసుమ కుమారి
30. రైల్వే కోడూరు– డాక్టర్ బోనాసి వెంకటసుబ్బయ్య
31. పుంగనూరు– బోడే రామచంద్ర యాదవ్
32. మచిలీపట్నం– బండి రామకృష్ణ