June 7, 2023

విహార యాత్రలో ఘోర విషాదం

విహార యాత్రలో ఘోర విషాదం

వారంతా మహారాష్ట్రలోని కొంకణ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సిబ్బంది. వీరిలో చాలా మంది యువకులే. సరదాగా పిక్‌నిక్‌ కోసం మహాబలిపురం బయలుదేరారు. బయలు దేరే ముందు అందరూ సరదాగా ఫోటోలు దిగారు. సాతారా జిల్లా అంబేనరి ఘాట్‌కి వచ్చేవరకు ప్రయాణం సాఫీగానే సాగుతోంది. ఉన్నట్టుంది ఏమైందో పక్కనే ఉన్న లోయలో బస్సు పడిపోయింది. ఇది ముందే గమనించిన ఓ వ్యక్తి బస్సు నుంచి దూకేశాడు. మిగిలిన వారికి మాత్రం ఆ ఛాన్స్‌ దొరకలేదు. ఏమవుతోందో తెలిసేలోపే 800 అడుగుల లోతున్న ఆ లోయలో పడి బస్సు నుజ్జు నుజ్జు అయింది. బస్సులో 35 మంది ఉన్నారు. వారిలో 32 మంది మరణించారు. మిగిలిన ఇద్దరూ కొన ఊపిరితో ఉన్నారు. మరణాన్ని తప్పించుకున్న ఆ వ్యక్తి అప్పటికే షాక్‌లో ఉన్నాడు. ఆ షాక్‌లోనే అక్కడి స్థానికులకు విషయం చెప్తే వారే పోలీసులను పిలిచారు. వెంటనే చర్యలు చేపట్టారు.. కానీ లోయ బాగా లోతుగా ఉండడం వల్ల మృత దేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. విహార యాత్రకు వెళ్లి విగత జీవులుగా మారిన ఈ ఘటన కంటతడి పెట్టిస్తోంది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *