June 7, 2023

గాంధీ భవన్‌ ఖాళీ అవుతోంది- టీఆర్‌ఎస్‌లోకి సుధీర్‌ రెడ్డి

గాంధీ భవన్‌ ఖాళీ అవుతోంది- టీఆర్‌ఎస్‌లోకి సుధీర్‌ రెడ్డి

ఏదో జరుగుతుందనుకుంటేమొదటికే మోసమొచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌కి తెలుగు దేశం పార్టీ వాస్తు అస్సలు సెట్‌ కాలేదు. ఏ ముహూర్తాన టి.కాంగ్రెస్‌, టీడీపీ కలిశాయో.. ఆ క్షణానే బ్యాడ్‌ డేస్‌ మొదలైపోయాయి. బాబు గారి లెగ్గు పుణ్యమో ఏమో గానీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్తమ్‌ కుమార్‌ తప్ప ఇంకెవరూ మిగిలేట్టు లేరు. ఈ మధ్యే రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌లు మంచి రోజు చూసుకుని గులాబీ కండువా కప్పేసుకున్నారు. కాంగ్రెస్‌కి అసలు షాక్ అంటే చేవెళ్ల చెల్లెమ్మ ఇచ్చారు. కాంగ్రెస్‌తో అత్యంత అవినాభావ సంబంధం ఉన్న సబితా ఇంద్రారెడ్డి కూడా కేసీఆర్‌ టీంలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరో షాక్‌. కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. శుక్రవారం కేటీఆర్‌ని కలిశారు. రోజు మారుతోందంటే తెలంగాణ కాంగ్రెస్‌ గుండె గుబేల్‌ మంటోంది. ఈ రోజు గాంధీ భవన్‌లో కనిపించిన వారురేపు టీఆర్‌ఎస్‌ భవన్‌లో తేల్తున్నారు. పాపం.. గాంధీ భవన్‌ ఖాళీ అవుతోంది. అటు ఏపీలోనూ కాంగ్రెస్‌ పరిస్థితి ఇలానే ఉంది.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *